News February 10, 2025
మంగపేట: మల్లూరు ఆలయంలో భక్తుల రద్దీ

మంగపేట మండలం మల్లూరు హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 23, 2026
సిరిసిల్ల: డ్రంకెన్ డ్రైవ్.. 20 రోజుల్లో 364 కేసులు..!

సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద సోమవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు. గత 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు.
News February 23, 2026
కర్ణాటక హైకోర్టుకు రణ్వీర్ సింగ్

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్వీర్పై<<>> కేసు నమోదైంది.
News February 23, 2026
ASF: డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆత్రం సుగుణ

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణ శిబిరం మూడో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై మార్గదర్శనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠిక ప్రతిని మంత్రి భట్టికి అందజేశారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.


