News February 10, 2025

మంగపేట: మల్లూరు ఆలయంలో భక్తుల రద్దీ

image

మంగపేట మండలం మల్లూరు హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News

News March 3, 2026

పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు: సత్యరాజ్

image

విషయం లేనివారే సినిమా డైలాగులు చెబుతారని TVK చీఫ్ విజయ్‌ని ఉద్దేశించి నటుడు సత్యరాజ్ కామెంట్స్ చేశారు. ‘పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు’ అని విమర్శించారు. ఇక TNను మరో అయోధ్యగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సనాతన Vs ద్రావిడ సిద్ధాంతం మధ్యే పోటీ అని, స్టాలిన్ ఉన్నంతవరకు మతశక్తులకు చోటు ఉండదన్నారు.

News March 3, 2026

పాలమూరు: ఆగని హిజ్రాల ఆగడాలు..!

image

ఉమ్మడి MBNR జిల్లాలో హిజ్రాల ఆగడాలు ఆగడం లేదంటూ పలువురు బాధితులు వాపోతున్నారు. శుభకార్యాలు, నూతన గృహప్రవేశాలు చేస్తే కొందరు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ దౌర్జన్యం చేస్తున్నారంటున్నారు. తాజాగా గద్వాల శివారులో హిజ్రాలు బరితెగించారు. కూతురిని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న ఓ తండ్రిని అడ్డుకున్నారు. చిల్లర లేదని, ఎగ్జామ్‌కు లేట్ అవుతుందని చెప్పినా వినకుండా రూ.500 గుంజుకున్నారు.

News March 3, 2026

మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.