News February 10, 2025
మంగపేట: మల్లూరు ఆలయంలో భక్తుల రద్దీ

మంగపేట మండలం మల్లూరు హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 26, 2026
తిరుపతి జిల్లాలో పరీక్షలకు 454 మంది డుమ్మా

తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.
News February 26, 2026
శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.
News February 26, 2026
గద్వాల్ జిల్లా DROగా పద్మజ రాణి

జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు DRO గా పద్మజ రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదే విధంగా జిల్లాలో ఆర్డీవో బాధ్యతలో ఉన్న ఉన్న అలివేలును హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులను నిర్వహిస్తున్న టి.శ్రీనివాస్ రావును జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖ అధికారిగా బదిలీ చేశారు.


