News March 23, 2024
మంగళగిరిలో 1952 ఎన్నికల్లోదే భారీ మెజార్టీ

మంగళగిరిలో అసెంబ్లీకి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా, తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.లక్ష్మయ్యకు వచ్చిన మెజార్టీ(17,265)నే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఈ మెజార్టీని దాటలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల మెజార్టీ ఇక్కడ అత్యల్పం. ఈసారి మంగళగిరి ఎన్నికల బరిలో నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు.
Similar News
News November 14, 2025
మాతృ మరణాల నివారణే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అన్ని వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలన్నారు. సమష్టిగా కృషి చేసి మాతృ మరణాలు నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.
News November 13, 2025
10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
News November 13, 2025
GNT: 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులపై సమీక్ష

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాల గురించి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా అధ్యక్షత వహించి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన వర్క్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్పర్సన్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


