News September 13, 2024
మంగళగిరి: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరారు.
Similar News
News October 26, 2025
తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 26, 2025
గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
GNT: గుమ్మడి సాగుతో అధిక దిగుబడి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంతర పంటల సాగుతో రైతులు అధిక లాభాలు అర్జిస్తున్నారు. ప్రధాన పంటలో గుమ్మడి కాయ ఒకటి. ఎకరాకు రూ.11 వేల వరకు పెట్టుబడితో 90 నుంచి 120 రోజుల్లో.. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, రూ. 50 నుంచి 80వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. జూన్-జులై, డిసెంబర్-జనవరి నెలలు సాగుకు అనువైన సమయం.
#నేడు జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం


