News July 11, 2024

మంగళగిరి- తాడేపల్లి కమిషనర్ బదిలీ

image

మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన్ను బాపట్ల మున్సిపల్ కమిషనర్‌గా.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న షేక్ అలీమ్ బాషా‌ను ఎంటీఎంసీ కమిషనర్ గా నియమించారు. అలానే బాపట్ల మున్సిపల్ కమిషనర్ బి.శ్రీకాంత్‌ను ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక్కడి డిప్యూటీ కమిషనర్ శివారెడ్డిని సీడీఎంఏకి అటాచ్ చేశారు.

Similar News

News October 31, 2025

నిన్నటి దాకా తుఫాన్.. ఇప్పుడు కృష్ణా నదికి వరద

image

నిన్నటివరకు తుఫాన్ కష్టాలు ఎదుర్కొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఇప్పుడు వరదల నేపథ్యంలో భయాందోళనలో ఉన్నారు. ప్రకాశం బరేజ్‌కు భారీగా నీటి ప్రవాహం చేరడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళనలో గురవుతున్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, ఇప్పుడు కృష్ణా నదికి వరద పెరగడంతో, ఈసారి పంట పరిస్థితి ఎలా ఉండబోతుందో అని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

News October 31, 2025

GNT: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తుపాన్ సమస్యలపై ఆరా

image

తుపాన్ కారణంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌ను సైతం ఉపయోగిస్తోంది. యాప్ ద్వారా సంక్షిప్త సందేశాలను ప్రజలకు పంపిస్తోంది. తుపాను కారణంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ సందేశాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

image

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.