News April 30, 2024
మంగళగిరి: నవతరం పార్టీ అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ పోలిన గుర్తు

నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు ఎన్నికల కమిషన్ గ్లాస్ టంబ్లర్ పోలిన గుర్తు కేటాయించింది. మంగళగిరి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో సుబ్రహ్మణ్యం పోటీకి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన అభ్యర్థనకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి రాజకుమారి గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News December 6, 2025
GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News December 5, 2025
పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
ANU: LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్ నెలల్లో జరిగిన BA LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలోని సంబంధిత కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


