News January 9, 2025
మంగళగిరి: శ్రీలక్ష్మీ నరసింహ ఆలయం చరిత్ర తెలుసా?
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీలక్ష్మి నరసింహ ఆలయం ముస్తాబవుతోంది. ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కొండపైన, దిగువన ఉన్న 3 దేవాలయాలు ఉన్నాయి. ఈదేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడి చరిత్ర. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. తెరుచుకున్న రంధ్రమే పానకాలస్వామి అని ప్రజలు నమ్మకం.
Similar News
News January 22, 2025
ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన గుంటూరు ఎస్పీ
పోలీస్ సర్వీస్ నియమాలకు విరుద్ధంగా నగదు అప్పు తీసుకుని చెల్లించని ఘటనల్లో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. వీరు ముగ్గురు ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీస్ నియమాలు-1964 లోని మూడవ నిబంధన ఉల్లంఘించారని, ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు ఎస్సీ తెలిపారు.
News January 22, 2025
మాచవరం: ఆమెపై లైంగిక దాడికి మరో మహిళ సహాయం
మాచవరంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై కథనం.. మాచవరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్నేహం ఉండేది. ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో స్నేహితునితో కలిసి దిగిన ఫొటోలను ఇవ్వాలంటూ అడిగింది. ఫొటోలు ఇస్తానని తెలంగాణకు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతనికి సహకరించిన మరో మహిళపై కేసు నమోదైంది.
News January 22, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు
తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.