News June 23, 2024
మంగళగిరి: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News December 24, 2025
GNT: బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 68 మందిని కాపాడాడు

పెదనందిపాడు మండలం వరగాని వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి చూపారు. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తుండగా డ్రైవర్కు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి నిలిపివేశారు. దీంతో బస్సులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను స్థానిక ఆలీ క్లినిక్కు, అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News December 23, 2025
విజయవాడలో ఏఐ వాషింగ్ మెషీన్ల విడుదల

విజయవాడలోని సోనోవిజన్లో ఎల్జీ ఇండియా అత్యాధునిక ‘ఏఐ డీడీ 2.0’ టెక్నాలజీతో 10 కొత్త వాషింగ్ మెషీన్ మోడళ్లను విడుదల చేసింది. సోనోవిజన్ ఎండీ పి.భాస్కర మూర్తి, ఎల్జీ ప్రతినిధులు వీటిని ఆవిష్కరించారు. ఈ మెషీన్లు బట్టల బరువు, మురికిని గుర్తించి వాష్ సైకిల్ను నిర్ణయిస్తాయని, స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా ఫోన్తో నియంత్రించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
News December 23, 2025
పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.


