News September 15, 2024
మంగళగిరి: 5 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

మంగళగిరిలో ఓ బాలికపై శనివారం మరో అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి బాలాజీ నగర్లో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల బాలికపై వెంకటేశ్వరరావు(61) అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా దిశా డీఎస్పీ కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి.
Similar News
News November 19, 2025
GNT: తెలుగు సాహితీవేత్త మద్దిపట్ల సూరి సేవలు అజరామరం

సాహిత్య విమర్శకుడు మద్దిపట్ల సూరి తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో సుపరిచితుడు. 1916, జులై 7న తెనాలి సమీపంలో ఆయన జన్మించారు. తెలుగు అకాడమీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా కీలక సేవలు అందించారు. అకాడమీ ద్వారా తెలుగులో విజ్ఞాన, శాస్త్ర సంబంధిత గ్రంథాల ప్రచురణకు ఆయన విశేష కృషి చేశారు. సూరి తెలుగు భాషాభివృద్ధికి, విద్యా సంబంధిత పుస్తకాల విస్తరణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1995 నవంబర్ 19న మరణించారు.
News November 19, 2025
గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.
News November 19, 2025
గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.


