News March 21, 2025
మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలి: కలెక్టర్

జిల్లాలో వారంలోగా మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News December 17, 2025
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో <<18592868>>స్పీకర్ నిర్ణయం<<>> ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. న్యాయస్థానాలపై, రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కు ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. కేవలం ఫోటోలకు పోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని ఎద్దేవా చేశారు. <<18593829>>ఉపఎన్నికలు<<>> వస్తే ఓడిపోతామని కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
News December 17, 2025
విజయవాడ: ఆర్టీసీ అధికారుల మొద్దు నిద్ర.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా!

విజయవాడ బస్టాండ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో మహిళ <<18595385>>రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి<<>>. గతంలోనూ జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. కాగా బస్టాండ్లో RTC డ్రైవర్లు అధిక వేగంతో బస్సులు నడుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. బస్టాండ్లో ఎలాంటి వ్యాపారాలు పెట్టి డబ్బులు సంపాదించాలి, ఏ షాపుని ఎన్ని లక్షలకు అద్దెకి ఇస్తే ఆదాయం వస్తుందన్న ఆలోచన తప్ప, ప్రయాణికుల భద్రతను పట్టించుకోవటం లేదన్నది స్పష్టమవుతోంది.
News December 17, 2025
ADB: 69 ఏళ్ల తర్వాత ఎన్నిక.. సర్పంచ్గా దేవురావు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. బరంపూర్ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవురావు విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సిడం లక్ష్మణ్పై 300పైగా ఓట్లతో గెలుపొందారు.


