News April 14, 2025
మంచిర్యాలకు మళ్లీ వస్తా.. ఇంకా చేస్తా: డిప్యూటీ సీఎం

రూ.1200 కోట్లతో మంచిర్యాలను అభివృద్ధి చేస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరాలు కురిపించారు. రాళ్లవాగు నుంచి గోదావరి ప్రాంతం ముంపునకు గురికాకుండా రూ.260కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.300 కోట్లతో జిల్లాకేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ వస్తాం.. ఇంకా చేస్తాం.. మంచిర్యాల అభివృద్ధి ఆగదు.. అంటూ భరోసా కల్పించారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి

పెనమలూరు పరిధిలోని ముద్దునూరులో 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. 4న ఆయన చనిపోగా, ఇవాళ రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
News December 6, 2025
కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?
News December 6, 2025
SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.


