News April 14, 2025
మంచిర్యాలకు మళ్లీ వస్తా.. ఇంకా చేస్తా: డిప్యూటీ సీఎం

రూ.1200 కోట్లతో మంచిర్యాలను అభివృద్ధి చేస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరాలు కురిపించారు. రాళ్లవాగు నుంచి గోదావరి ప్రాంతం ముంపునకు గురికాకుండా రూ.260కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.300 కోట్లతో జిల్లాకేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ వస్తాం.. ఇంకా చేస్తాం.. మంచిర్యాల అభివృద్ధి ఆగదు.. అంటూ భరోసా కల్పించారు.
Similar News
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్ఫెక్ట్గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.
News April 17, 2026
శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.


