News February 12, 2025
మంచిర్యాలలో యువతి అదృశ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739326496296_50225406-normal-WIFI.webp)
మంచిర్యాలలోని ఏసీసీ చెందిన 22 ఏళ్ల యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. తిరుపతి, సుమలత దంపతుల కుమార్తె(22) తరుచుగా ఫోన్లో మాట్లాడుతుంటే తల్లి మందలించింది. దీంతో ఈ నెల 4న ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 12, 2025
Good News: తగ్గిన రిటైల్ ఇన్ఫ్లేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358552192_1199-normal-WIFI.webp)
భారత రిటైల్ ఇన్ఫ్లేషన్ 5 నెలల కనిష్ఠానికి చేరుకుంది. డిసెంబర్లోని 5.22 నుంచి జనవరిలో 4.31 శాతానికి తగ్గింది. కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇక రూరల్ ఇన్ఫ్లేషన్ 5.76 నుంచి 4.64, అర్బన్ ఇన్ఫ్లేషన్ 4.58 నుంచి 3.87 శాతానికి తగ్గాయి. ధరలు తగ్గడంతో RBI మరోసారి వడ్డీరేట్ల కోత చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపోరేటును 6.25 నుంచి 6 శాతానికి తగ్గించొచ్చని భావిస్తున్నారు.
News February 12, 2025
ఏ సినిమాకు వెళ్తున్నారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350166795_746-normal-WIFI.webp)
ఈ వారం కొత్త సినిమాల కంటే పాత సినిమాల హవానే ఎక్కువగా ఉంది. వాలంటైన్స్ డే కావడంతో పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈనెల 14న విశ్వక్సేన్ ‘లైలా’, బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదేరోజున రామ్ చరణ్ ‘ఆరెంజ్’, సూర్య ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ కానున్నాయి.
News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358201566_81-normal-WIFI.webp)
AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.