News March 10, 2025

మంచిర్యాలలో వ్యభిచారం

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో ఆదివారం వ్యభిచారం కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్క సమాచారం మేరకు దాడి చేసి ఆమెతో పాటు నస్పూర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి సహా పలువురు మహిళలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.

News July 6, 2025

ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 6, 465 కేసులు రాజీ

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6, 324 పెండింగ్ కేసులను 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీవ్ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. మొత్తం 6,465 కేసులను రాజీ జరిగాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ 219, క్రిమినల్ 5,976 అలాగే 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

News July 6, 2025

KMR: ‘రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలి’

image

సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు ఆదేశించారు. కామారెడ్డిలో శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.