News March 14, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్లో నివాసం ఉండే వి.శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్న శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీధర్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.
News November 20, 2025
ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ను కలిసిన కేయూ JAC

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్గా పి.భాస్కర్ నూతనంగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా కేయూ జేఏసీ నాయకులు గురువారం ఆయనను కలిశారు. ప్రిన్సిపల్ను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు ప్రిన్సిపల్ను కోరారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.


