News March 14, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్లో నివాసం ఉండే వి.శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్న శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీధర్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.
News December 1, 2025
వరంగల్: రాజకీయ పార్టీల్లో వలసల జోరు!

రాజకీయ పార్టీల్లో వలసల జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. డబ్బు, మద్యం, పదవుల ఆశ చూపడంతో పార్టీల్లో చేరికల పరంపర కొనసాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కావడంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం పార్టీల్లోకి చేరికలు జరిగాయి.


