News March 4, 2025
మంచిర్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్లు, ఈఈలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆర్థిక సంవత్సరం ముగింపుపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పరిధిలో కేటాయించిన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం మంజూరైన నిధులు ఖర్చుల వివరాలు, గుత్తేదారులకు కేటాయించిన పనుల వివరాలు, ఖర్చులు, జీఎస్టీ ఇతర పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని వారికి సూచించారు.
Similar News
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.
News December 2, 2025
ఆ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు: కేంద్రమంత్రి

<<18445876>>సంచార్ సాథీ యాప్పై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ యాప్ కంపల్సరీ ఏమీ కాదని, ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ యాప్తో పౌరుల గోప్యతపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో సింధియా స్పష్టతనిచ్చారు.
News December 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.


