News March 4, 2025
మంచిర్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్లు, ఈఈలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆర్థిక సంవత్సరం ముగింపుపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పరిధిలో కేటాయించిన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం మంజూరైన నిధులు ఖర్చుల వివరాలు, గుత్తేదారులకు కేటాయించిన పనుల వివరాలు, ఖర్చులు, జీఎస్టీ ఇతర పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని వారికి సూచించారు.
Similar News
News March 25, 2025
కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
News March 25, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.9 °c, వీర్నపల్లి 37.8°c, గంభీరావుపేట 37.8°c, కోనరావుపేట 37.6°c, రుద్రంగి 37.7°c, తంగళ్లపల్లి 35.6°c, ఇల్లంతకుంట 35.9°c,ఎల్లారెడ్డిపేట 35.0°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 25, 2025
విశాఖ రైతు బజార్లో నేటి కూరగాయల ధరలు

విశాఖ రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.