News February 3, 2025
మంచిర్యాల: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. కాగా అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. మరేదైనా కారణం వల్ల మృతి చెందాడా అనే తెలియాల్సి ఉందన్నారు. మృతుడి ఛాతిపై అమ్మ అని రాసి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
Similar News
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
News February 8, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగుస్తాయని RIO యోహాన్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 56 కేంద్రాల్లో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రాక్టికల్స్కు 4,363 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.
News February 8, 2026
JNTUHలో ‘బంగారు’తల్లి ఈమే!

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ CSE విభాగంలో అల్లంరాజు శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. యూనివర్సిటీ నుంచి 4 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో సైతం ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సైతం సాధించింది. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, వారి కలలు సాకారం చేశానని తెలిపింది.


