News October 16, 2024
మంచిర్యాల: ఆకాశంలో హనుమంతుని రూపం

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మబ్బులు హనుమంతుని రూపంలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆ దృశ్యంలో ఆంజనేయుడు శంఖం ఊదినట్లుగా కనిపించింది. దీంతో పలువురు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
Similar News
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
ADB: శిక్షణ సివిల్ సర్వీస్ అధికారుల బృందానికి వీడ్కోలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కు చెందిన శిక్షణ అధికారులు (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్) బృందం జిల్లా పర్యటన ముగిసింది. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.
News November 8, 2025
పకడ్బందీగా సరిహద్దులు గుర్తించాలి: ADB కలెక్టర్

చిత్తడి నేలల సర్వే, సరిహద్దుల గుర్తింపుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా పకడ్బందీగా సరిహద్దులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీ రావు పాటిల్ పాల్గొన్నారు.


