News August 17, 2024
మంచిర్యాల: ఆగి ఉన్న కారులోంచి రూ.18లక్షలు చోరీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఫిన్ చేద్దామని ఆపిన కారులో నుంచి రూ.18 లక్షల నగదును అపహరించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యాపారం పనులపై హైదరాబాద్ నుంచి వచ్చిన వాసవి ట్రేడర్స్ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి కారులో ఉంచారు. అయితే కారు డోర్ లాక్ వేయక పోవడంతో నగదు తీసుకొని దుండగులు పరారైనట్లు తెలిపారు.
Similar News
News December 12, 2025
మొదటి విడతలో ఎన్నికల్లో 15 కేసులు: ADB SP

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News December 12, 2025
ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 11, 2025
హీరాపూర్: కోడలిపై అత్త విజయం

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.


