News April 12, 2025
మంచిర్యాల: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News November 14, 2025
ట్రంప్కు క్షమాపణలు చెప్పిన BBC

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.
News November 14, 2025
TTD ఈవోను ప్రశ్నించిన సిట్ ఆధికారులు..?

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను రెండు రోజులు క్రితం కలిసినట్లు సమాచారం. నెయ్యి టెండర్ల విధివిధానాలు మార్చినప్పుడు ఈవోగా ఆయనే ఉండటంతో దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. టెండర్ల గురించి ముందు అధికారులను అడిగితే తెలుస్తుందని మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. దీంతో సింఘాల్ను కలిసి ఈ అంశాలపై చర్చినట్లు సమాచారం.
News November 14, 2025
జగిత్యాల: 394 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మొత్తం 436 వరి కొనుగోలు కేంద్రాలకు 394 కేంద్రాలు ఇదివరకే ప్రారంభం అయ్యాయని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. 56 కోట్ల రూపాయల విలువగల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 28 కోట్ల రూపాయల విలువ వరకు రైతుల వివరాలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రతి మండలానికి, క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు.


