News February 12, 2025
మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
Similar News
News December 23, 2025
‘జాతీయ రైతు దినోత్సవం’ వెనుక కథ ఇదే..

రైతు కుటుంబంలో పుట్టి తన చివరి క్షణం వరకు అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి మాజీ ప్రధాని ‘చౌదరి చరణ్ సింగ్’. ఆయన కృషి, పోరాటం వల్ల ‘జమీందారీ చట్టం’ రద్దై ‘కౌలుదారీ చట్టం’ అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలిచ్చే విధానం వచ్చింది. అందుకే చరణ్ సింగ్ను ‘రైతు బంధు’గా పిలుస్తారు. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా చరణ్ సింగ్ పుట్టినరోజైన DEC-23ను ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటున్నారు.
News December 23, 2025
హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.
News December 23, 2025
గూగుల్ టెకీలకు గుడ్న్యూస్.. గ్రీన్కార్డ్ ప్రాసెస్ మళ్లీ షురూ!

H-1B వీసాతో గూగుల్లో పనిచేసే వారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియను 2026 నుంచి మళ్లీ భారీ స్థాయిలో మొదలుపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఆఫీసు నుంచి పనిచేస్తూ, మంచి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్న సీనియర్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశం కోసం రిమోట్ వర్కర్లు ఆఫీసు లొకేషన్కు మారాలి. లేఆఫ్స్ వల్ల రెండేళ్లుగా ఆగిన ఈ ప్రాసెస్ మళ్లీ స్టార్ట్ కానుండటంతో వేలాదిమంది ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.


