News October 11, 2024
మంచిర్యాల: ఒకే గ్రామంలో నలుగురికి టీచర్ ఉద్యోగాలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలోని నలుగురు డిఎస్సిలో ఒకే ప్రయత్నంలో టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఏకారి ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు పుప్పాల మానస, రవళి, మానస ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ చదవించి ఉద్యోగాలు సాధించారు. ఒకే గ్రామం నుంచి నలుగురు టీచర్ ఉద్యోగాలు పోందినందుకు గ్రామస్థులు మిత్రులు అభినందించారు.
Similar News
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్ను పలువురు అభినందించారు.
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.


