News April 16, 2025
మంచిర్యాల కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూ భారతిపై నిర్వహించే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొంటారని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. జన్నారం రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటలకు భూ భారతిపై నిర్వహించే సదస్సులో కలెక్టర్ పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 29, 2025
కందుకూరు, అద్దంకి డివిజన్లో కలిసే మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని కొన్ని డివిజన్లలో మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా కందుకూరు డివిజన్లోకి లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం వచ్చి కలవనున్నాయి. కనిగిరి డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు డివిజన్లో కలవనున్నాయి. అద్దంకి పరిధిలోకి బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు- ఒంగోలు నుంచి ముండ్లమూరు, తాళ్ళూరు, కనిగిరి నుంచి దర్శి, దొనకొండ, కురిచేడు రానున్నాయి.
News November 29, 2025
TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.
News November 29, 2025
TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.


