News February 19, 2025

మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.

Similar News

News October 27, 2025

గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లే ఫ్లైట్ రద్దు

image

విశాఖపట్నంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల గన్నవరం విమానాశ్రయం నుంచి వైజాగ్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

News October 27, 2025

NGKL: పారదర్శకంగా కొనసాగిన మద్యం దుకాణాల కేటాయింపు

image

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. 67 దుకాణాలకు గాను మొత్తం 1518 దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారుల సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు.

News October 27, 2025

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.