News March 17, 2025

మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.

Similar News

News March 18, 2025

‘అర్జున్ రెడ్డి’ మూవీలో ఇప్పుడు నటిస్తారా? హీరోయిన్ స్పందనిదే

image

‘అర్జున్ రెడ్డి’లో తన పాత్ర బలహీనంగా ఉంటుందని షాలినీ పాండే అభిప్రాయపడ్డారు. అలాంటి మూవీలో ఇప్పుడు నటిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘కచ్చితంగా నటిస్తా. కానీ డైరెక్టర్‌తో కొన్ని మార్పులు చేయించుకుంటా. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడంతో అమాయకంగా ఉండేదాన్ని. ఇప్పుడు బలమైన క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. ఇటీవల ఆమె ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్‌లో నటించారు.

News March 18, 2025

రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

News March 18, 2025

కృష్ణా: పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు- కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.

error: Content is protected !!