News March 17, 2025
మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
Similar News
News January 8, 2026
రాయ‘చోటిస్తారా’?

రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేయడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం పెండిగ్లో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగల్లు ప్రాజెక్ట్లో పెండింగ్ పనుల పూర్తి, చిన్నమండెంలో నిర్మితమై ఉన్న రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు చేరేలా చర్యలు తీసుకోవాలి. గువ్వలచెరువు ఘాట్ టన్నెల్, మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుతం రియలెస్టేట్ దెబ్బతింటోంది కాబట్టి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆశిస్తున్నారు.
News January 8, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS స్పెషల్ మ్యానిఫెస్టో

TG: ‘సర్పంచ్’ ఫలితాల జోష్తో మున్సిపల్ ఎన్నికలకు BRS సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీల్లో రాజకీయ ఎజెండాను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించాలని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ జారీ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోను ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.
News January 8, 2026
మరోసారి పడిపోయిన మీషో షేర్లు.. కారణమిదే!

జనరల్ మేనేజర్ మేఘా అగర్వాల్ రాజీనామాతో మీషో షేర్ల విలువ మరోసారి భారీగా పతనమైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే షేర్ వాల్యూ రూ.165కు చేరుకుంది. వరుసగా మూడో సెషన్లో కూడా కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. DECలో రూ.254.40 వద్ద ఆల్టైమ్ హైకి చేరిన షేర్లు బుధవారం మరో 5% పతనమయ్యాయి. తాజాగా లిస్టింగ్కు వచ్చిన మీషో షేర్ వాల్యూ ఇప్పటివరకు 35% పడిపోవడంతో రూ.40వేల కోట్ల సంపద ఆవిరైంది.


