News March 17, 2025
మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
Similar News
News December 8, 2025
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: హనుమకొండ కలెక్టర్

అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ పోస్టర్లను ఆవిష్కరించారు. అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడు, ఉద్యోగి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. లంచం డిమాండ్ చేస్తే ACB టోల్ ఫ్రీ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వరంగల్ ACB డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
News December 8, 2025
ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: భూపాలపల్లి ఎస్పీ

ప్రజా దివస్కు వచ్చిన ఫిర్యాదులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యక్రమంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 9 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలు విన్న ఎస్పీ వారి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
News December 8, 2025
తిరుచానూరు: అర్చకులకు తెలిసే జరిగిందా…?

తిరుచానూరు ఆలయంలో అనాధికారిక వ్కక్తుల్లో ఒక్కరు అవినాష్. ఆలయంలోని అర్చకులకు తెలిసే అతను ఆలయంలోకి వస్తున్నాడని సమాచారం. ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల వద్ద కనిపించే ఈ వ్యక్తి ఎవరు అని ఇతరులు ప్రశ్నించకపోవడంతో అర్చకులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.


