News March 14, 2025
మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ADBలో 40డిగ్రీలు, ఆసిఫాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News November 28, 2025
డ్రెస్సునో, లిప్స్టిక్నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్స్టిక్నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.
News November 28, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 13 మందికి జైలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు, న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 58 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారికి శిక్షలు ఖరారు అయ్యాయి. 13 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. (కామారెడ్డి-7, దేవునిపల్లి-2, మాచారెడ్డి-1, దోమకొండ-1, తాడ్వాయి-2) మిగతా 45 మందికి మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.


