News January 31, 2025

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

image

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. MNCL మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌ను లక్షెట్టిపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివాజీని నియమించారు. మందమర్రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును వనపర్తికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో రామగుండం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ తుంగపిండి రాజలింగును నియమించారు.

Similar News

News October 27, 2025

70 రకాల సొంత విత్తనాలతో సేంద్రియ సేద్యం

image

30 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్నకు చెందిన రైతు చిన్న చంద్రమ్మ. విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తెలంగాణ డీడీఎస్ KVKతో కలిసి 70కి పైగా విభిన్న విత్తనాలను నిల్వ చేసి వాటినే సాగు చేస్తూ, ఇతర రైతులకు అందిస్తున్నారు. సాగు, రైతులపై పాటలు కూర్చి రేడియోలో పాడి స్ఫూర్తి నింపుతున్నారు.☛ రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

అనకాపల్లి: ‘తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించాలి’

image

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను అధికారులు ముందుగా గుర్తించాలని జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయకృష్ణన్, SP తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. శాఖల వారీగా చేసిన ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

News October 27, 2025

బాలీవుడ్ యువ నటుడి ఆత్మహత్య

image

బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో తన ఇంట్లో ఈనెల 23న ఆయన ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 24న చనిపోయారు. ‘జంతారా సీజన్2’తో సచిన్ ఫేమస్ అయ్యారు. ఆయన నటిస్తున్న ‘అసుర్వన్’ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.