News February 5, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1: MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
2:మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి
3:గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
4:ALL INDIA తెలుగు CARTOONISTల డైరెక్టరీలో బెల్లంపల్లి వాసి
5:MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం
6:మంచిర్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్

Similar News

News December 25, 2025

శివస్వరూపంగా శ్రీనివాసుడు

image

తిరుమల మూలవిరాట్టును పూర్వం విష్ణు రూపమని కొందరు, శైవ రూపమని మరికొందరు భావించారు. స్వామివారి తలపై ఉండే జటలు, కంఠంలోని నాగభూషణాలు చూసి శివుడిగానూ ఆరాధించారు. విగ్రహానికి ఉన్న విలక్షణ లక్షణాలు శివ, కేశవ ఇరువురినీ స్మరింపజేస్తాయి. అందుకే ఇప్పటికీ తిరుమలలో శైవ, వైష్ణవ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. విష్ణుమూర్తి సర్వవ్యాపి అని, ఆయనలో శివుడు కూడా అంతర్భాగమని చెప్పడానికి ఈ రూపం గొప్ప నిదర్శనం.

News December 25, 2025

SRD: విషాదం.. సర్పంచ్ మృతి

image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపుర్ (ఎన్) గ్రామ సర్పంచ్ ఎర్రోల్ల అక్కమ్మ (61) బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతురాలుగా పోటీ చేసి గెలుపొందారు. అక్కమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 22న పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అకాల మరణం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

News December 25, 2025

ఈ ఏడాది కామారెడ్డి పోలీసుల భారీ విజయం

image

అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. SP రాజేష్ చంద్ర 2025 వార్షిక నివేదికలో వెల్లడించిన వివరాలిలా.. ఈ కేసుకు సంబంధించి 8 రాష్ట్రాల్లో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎనిమిది మందిపై PD యాక్ట్ ప్రయోగించారు. వీరి నుంచి నకిలీ నోట్లు, నగదు, ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని SP స్పష్టం చేశారు.