News February 11, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

◼️మంచిర్యాల RTC బస్టాండ్లో ప్రమాదం◼️MNCL: నేటి నుంచి పలు రైళ్లు రద్దు◼️బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్◼️ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్లో మందమర్రి బాలుడు◼️తాండూర్: మాదారం బీట్లోకి పెద్దపులి
Similar News
News November 13, 2025
‘బాల్య వివాహాల రహితంగా సిరిసిల్ల జిల్లాను మార్చాలి’

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాలు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 13, 2025
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.
News November 13, 2025
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మెరిసిన పల్నాడు స్విమ్మర్లు

విశాఖపట్నంలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్లో పల్నాడు జిల్లా స్విమ్మర్లు కే. శివ సాకేత్, లోహిత్ ప్రతిభ కనబరిచారు. శివ సాకేత్ 200 మీ. బటర్ఫ్లైలో బంగారు, 50, 100 మీ. బటర్ఫ్లైలో రెండు కాంస్య పతకాలు, లోహిత్ 200 మీ. బటర్ఫ్లైలో కాంస్య పతకం సాధించారని కోచ్ సురేశ్ తెలిపారు. అనంతరం పలువురు వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


