News February 9, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

*అంకుశం వైపు పులి కదలికలు*వైభవంగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ *బార్‌లో దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్*రాజకీయ జోక్యంతో దిగజారుతున్న సింగరేణి*గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Similar News

News March 16, 2025

హనుమకొండ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

వరంగల్, హనుమకొండ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.160-180 ఉండగా.. స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

News March 16, 2025

విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.

News March 16, 2025

NZB: యాక్సిడెంట్.. బోల్తా పడ్డ కారు

image

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్‌పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!