News January 31, 2025

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్దపులి సంచరిస్తున్న అడుగులు గుర్తించినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. ధర్మారావుపేట అటవీ అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెం శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు అనుమాన వ్యక్తం చేశారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

Similar News

News November 24, 2025

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ గురించి మీకు తెలుసా..?

image

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 21,36,660 జనాభాను కలిగి ఉంది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా చిరుమామిళ్ల మధుబాబును ప్రభుత్వం ఇటీవల నియమించింది.

News November 24, 2025

పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత ప్లేయర్లు

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత ప్లేయర్ల ఆటతీరు మారడం లేదు. నిలకడ లేమితో వికెట్లు పారేసుకుంటున్నారు. తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒక్కడే 58 రన్స్‌తో కాస్త రాణించారు. రాహుల్(22), సుదర్శన్(15), నితీశ్(10), పంత్(7), జడేజా(6), జురెల్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.

News November 24, 2025

పదేళ్లలో BRS ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు: సీతక్క

image

పదేళ్లలో BRS ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు. సోమవారం BHPL జిల్లా గోరి కొత్తపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘంలో సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ₹10 లక్షలు అందిస్తున్నామని అన్నారు. అలాగే, సంఘంలో లోన్ తీసుకున్న మహిళ చనిపోతే వారి లోన్ మాఫీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇలా మరణించిన 64 మందికి లోన్ మాఫీ జరిగిందని ఆమె తెలిపారు.