News March 28, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు.!

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 9,198 మంది రెగ్యూలర్ విద్యార్థులకు గాను 9,175 మంది, గతంలో ఫెయిలైన 134 మంది విద్యార్థులకు గాను 118 మంది హాజరయ్యారు. మొత్తం 9,332 మందికి 9,293 విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News December 16, 2025
పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్ మెహ్రీన్

తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్స్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తాను నిజంగా మ్యారేజ్ చేసుకుంటే అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు. ఫేక్ ఆర్టికల్స్ రాయడంపై ఫైరయ్యారు. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్తో ఆమెకు 2021లో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి రద్దయింది.
News December 16, 2025
ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.
News December 16, 2025
పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


