News March 5, 2025

మంచిర్యాల జిల్లాలో 23 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,540 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News December 8, 2025

2026లోనూ బంగారం ధరల పెరుగుదల: గోల్డ్ కౌన్సిల్

image

బంగారం ధరల పెరుగుదల వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటుండటం, గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం ఇందుకు కారణమని చెప్పింది. ఈ ఏడాది నవంబర్ వరకు బంగారం 60% పెరుగుదల కనబరిచిన విషయం తెలిసిందే.

News December 8, 2025

గద్వాల్: 700 పోలింగ్ కేంద్రాలు- కలెక్టర్ సంతోష్

image

ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మనోపాడు, ఉండవెల్లి మండలాల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించడానికి పీఓలు 700, ఓపీఓలు 859 సిబ్బంది మొత్తం 1,559 మందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామన్నారు.

News December 8, 2025

కృష్ణా: అన్నదాతకు రవాణా కష్టాలు

image

ఉమ్మడి కృష్ణాలో వరి కోతలు ఊపందుకున్నా, ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రూ.1790 మద్దతు ధర ఇస్తున్నా.. హమాలీ, రవాణా ఖర్చులు పోగా రైతుకు నికరంగా రూ.1600 మాత్రమే దక్కుతోంది. ట్రాన్స్‌పోర్ట్ సమస్య రైతులను వేధిస్తోంది. జీపీఎస్ ఉన్న వాహనాలు తక్కువగా ఉండగా, ఈ నెల 10 నుంచి లారీ అసోసియేషన్ బంద్ ప్రకటించడంతో రైతుల కష్టాలు మరింత పెరగనున్నాయి. వర్షాల వల్ల దిగుబడి కూడా తగ్గింది.