News January 24, 2025
మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
MLA ఉత్తమ్ పద్మావతి గారూ.. 152 మంది రైతుల అవస్థలు తీరేనా?

సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామ వైకుంఠధామం నుంచి గండ్ల చెరువు వరకు సుమారు 3 కిలోమీటర్ల డొంక మార్గం అస్తవ్యస్తంగా ఉండటంతో 152 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రైతులు, పశువులు అలుగు నీటిలో నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చెరువు వద్ద తక్షణమే కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి, రాకపోకల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని రైతులు కోరుతున్నారు.
News November 21, 2025
Hello Day: ఇవాళ్టి స్పెషాలిటీ ఇదే..

ఎదుటివారితో మన సాధారణ పలకరింపులు, ఫోన్ కన్వర్జేషన్లు Helloతోనే మొదలవుతాయి. ఇంత ప్రాధాన్యమున్న ‘హలో’నూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ డే ఉంది. అది ఈ రోజే(NOV21). 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని రూపొందించారు. ప్రపంచ నాయకులు సంఘర్షణలను కమ్యూనికేషన్తో పరిష్కరించుకోవాలనేది దీని ఉద్దేశం. ప్రజలు కూడా కనీసం 10 మందికి శుభాకాంక్షలు చెప్పి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
నెల్లూరు జిల్లాలో అధ్వాన స్థితిలో PHCలు

నెల్లూరు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు దయనీయంగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. PHCల పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెల గ్రేడ్ కేటాయిస్తుంది. అక్టోబర్ నెలలో A. గ్రేడ్ సాధించిన PHC జిల్లాలో ఒక్కటి కూడా లేదు. 8 PHCలకు B. గ్రేడ్, 36 PHCలకు C. గ్రేడ్, 8 PHCలకు D. గ్రేడ్ వచ్చింది. A. గ్రేడ్ రావడం గగనమైంది. PHCల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.


