News January 24, 2025

మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 4, 2025

Way2Newsలో కథనం.. స్పందించిన సూర్యాపేట హౌసింగ్ పీడీ

image

‘సూర్యాపేట కలెక్టరేట్‌లో కదలని ఇందిరమ్మ ఇండ్ల ఫైల్స్’ అనే శీర్షికతో Way2Newsలో OCT 22న కథనం ప్రచురితమైంది. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్ స్పందించి చొరవ తీసుకోని జాజిరెడ్డిగూడెంకి చెందిన దివ్యాంగురాలు చనగాని లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో మార్పులను సరిచేసి MPDOకు పంపించారు. గ్రామ సెక్రటరీ నవీన్ రెడ్డి మంజూరు పత్రాన్ని అందజేశారు. తన సమస్యను పరిష్కరించిన అధికారులకు లక్ష్మమ్మ కృతజ్ణతలు తెలిపారు.

News November 4, 2025

రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

image

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.

News November 4, 2025

భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 30. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.