News January 24, 2025
మంచిర్యాల: తండ్రిని హతమార్చిన తనయుడు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకు కడతేర్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆవిడపు రాజన్నను కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొడుకు సాయిసిద్ధార్థ్ దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 18, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాల్లో టార్ఫాలిన్, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, కొనుగోలు వెంటనే ట్యాబ్ ఎంట్రీ, నగదు/బోనస్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 18, 2025
కోరుట్ల: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన జువ్వాడి

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు, జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ జై కుమార్కు దరఖాస్తును అందజేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తదితరులను ఆయన సన్మానించారు.
News October 18, 2025
మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎండోమెంట్ అధికారులు, స్థానిక పూజారులు ఉన్నారు.