News March 16, 2025

మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారీ ఇచ్చిన కొడుకు

image

తండ్రిపై దాడి చేయించేందుకు సుపారీ ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.

Similar News

News November 27, 2025

సినిమా అప్డేట్స్

image

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్‌టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

News November 27, 2025

వరంగల్ ఎంజీఎంలో ఫిర్యాదుల పెట్టె

image

వరంగల్ ఎంజీఎంలో సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ సత్యశారద ఆసుపత్రిలో ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంజీఎంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలపై చాలా ఫిర్యాదులు చేశారు. పేషెంట్లు, వారి కుటుంబీలకు కలిగిన అసౌకర్యం, అధికారులు, సిబ్బంది అవినీతిపైన భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

News November 27, 2025

బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.