News March 16, 2025
మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారీ ఇచ్చిన కొడుకు

తండ్రిపై దాడి చేయించేందుకు సుపారీ ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.
Similar News
News April 21, 2025
మే రెండో వారంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, ‘OG’ సినిమాల విడుదలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. HHVM వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈలోగా మిగిలిన చిత్రీకరణతో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నాయి.
News April 21, 2025
భూ భారతి చట్టం రైతులకు భద్రత: కలెక్టర్

భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు ఈ చట్టం భద్రతగా ఉంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం అలంపూర్ పట్టణంలో ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
News April 21, 2025
కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారంటే? 1/2

పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.