News February 27, 2026
మంచిర్యాల: నర్సరీ విద్యార్థిని చితకబాదిన టీచర్

మందమర్రిలోని తవక్కల్ హైస్కూల్లో నర్సరీ చదువుతున్న బాలుడిని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ చితకబాదింది. అందుగుల పేట గ్రామానికి చెందిన రాపల్లి పృద్విక్ తవక్కల్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. పృద్విక్ ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి విద్యార్థి తల్లిదండ్రులు కరస్పాండెంట్ అజీజ్కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారు.
Similar News
News April 12, 2026
విశాఖ: కటకటాల్లోకి ఏసీ శాంతి.. ఉద్యోగం నుంచి సస్పెండ్

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ACB అధికారులు ఏసీ శాంతిపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 7న చేపట్టిన తనిఖీల్లో రూ.1.37 CR అక్రమాస్తులను గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు శాంతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి ఉమ్మడి విశాఖలో ఏసీగా పనిచేశారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్లోనూ మేడ్చల్ FIRST

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మేడ్చల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 64,146 మంది పరీక్షలు రాయగా 53,071 మంది పాసై 82.73 శాతంతో స్టేట్లోనే ఫస్ట్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1,280 మందికి 922మంది పాసై 72.03%తో 23వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 6,106 మందికి 1,904 మంది పాసై 31.18%తో 21వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 10th ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. హనుమకొండకు 8వ ర్యాంక్

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. హనుమకొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 17,435 మంది పరీక్షలు రాయగా 13,698 మంది పాసై 78.57 శాతంతో స్టేట్లోనే 8వ ర్యాంక్ వచ్చింది.ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1003 మందికి 740 మంది పాసై 73.78 శాతంతో 19వ స్థానంలో నిలవగా, రెగ్యులర్ ప్రైవేట్లో 1537 మందికి 530 మంది పాసై 34.48%తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 35 మందికి 22 మంది పాసై 62.86%తో 7వ ర్యాంక్ వచ్చింది.


