News March 26, 2025
మంచిర్యాల: నేటి పరీక్షకు 31 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో జరిగిన గణిత శాస్త్రం పరీక్షకు 9,198 మంది విద్యార్థులకు గాను 9,178 విద్యార్థులు, గతంలో ఫెయిలైన 90 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మొత్తం 9,288 మందికి 9,257 విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News November 20, 2025
MHBD: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే: డీఎంహెచ్వో

మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వో (DMHO) రవి రాథోడ్ పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల వారు ప్రతి నెల 5వ తేదీలోపు ఫామ్-ఎఫ్లను ఆరోగ్యశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని డీఎంహెచ్వో స్పష్టం చేశారు.
News November 20, 2025
నాబార్డ్ ఎర్త్ సమ్మిట్లో Dy.CM భట్టి, మంత్రి తుమ్మల

హైదరాబాద్ హైటెక్స్లో నాబార్డ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ ఛైర్మన్ షాజీ, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితర ప్రముఖులు హాజరై పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
News November 20, 2025
సిద్దిపేట: ‘నా చిట్టి చేతులు’ ఇటుక బట్టీల పాలు!

బడికి వెళ్లి హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో పిల్లల భవిష్యత్ బూడిద పాలవుతుంది. ఈ దయనీయ పరిస్థితి అక్బర్ పేట భూంపల్లిలోని ఇటుక బట్టీలో కనిపించింది. ప్రభుత్వాలు 18 ఏళ్లు నిండని పిల్లలతో పనులు చేయించవద్దని చెప్తున్న కాంట్రాక్టర్లు, గుత్తేదారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారు తమకు నచ్చినట్లుగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుక బట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


