News February 28, 2025

మంచిర్యాల: నేడు, రేపు తాగునీటికి సరఫరాలో అంతరాయం

image

జిల్లాలో మిషన్ భగీరథ శుద్ధి కేంద్రానికి మరమ్మతులు చేయనుడడంతో శుక్రవారం, శనివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఈడీ మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట్, హాజీపూర్, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటిపల్లి మండలాలకు, మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్ పురపాలక సంఘాలకు రెండు రోజుల తాగునీరు నిలిపి వేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

సిరిసిల్ల: ‘పిల్లలకు ఆరునెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి’

image

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో NATIONAL NEW BORN WEEK అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. నవజాత శిశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.

News November 21, 2025

సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

image

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.

News November 21, 2025

పాడేరు: వినతులు స్వీకరించిన కలెక్టర్ దినేష్

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఎ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొన్నారు.