News March 25, 2024

మంచిర్యాల: పండగపూట విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామానికి గోపులాపురం కార్తీక్( 22) అనే యువకుడు గూడెం లిఫ్ట్ కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ స్వస్థలం జన్నారం మండలం ధర్మారం గ్రామం కాగా హోలీ పండుగకు తన తాత ఇంటికి వచ్చాడు. గూడెం లిఫ్ట్ కాలువలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

image

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

News December 3, 2025

విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

image

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

News December 3, 2025

ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

image

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.