News March 28, 2025
మంచిర్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

నస్పూర్లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీల నియామకం

ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీ నియామకాలను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి కిషోర్ గురువారం ప్రకటించారు. కీర్తి వెంకట రాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇలపకుర్తి కుసుమ కుమారి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అగ్రహారపు వెంకటేశ్వరరావు ఓబీసీ మోర్చా, బుర్రి శేఖర్ ఎస్సీ మోర్చా, సయ్యద్ మీర్ జాఫర్ అలీ మైనారిటీ మోర్చా, అడబాక నాగ సురేష్ యువ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.
News December 4, 2025
నవోదయ పరీక్షకు 28 కేంద్రాలు: పూర్ణిమ

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5648 మంది విద్యార్థులు హాజరు అవుతారని వెల్లడించారు. www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ పొందాలని సూచించారు. వివరాలకు 9110782213 హెల్ప్ లైన్లో సంప్రదించాలన్నారు.
News December 4, 2025
శ్రీరాంపూర్: ఈ నెల 8న అప్రెంటిస్ట్ మేళా

ఈ నెల 8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ శ్రీరాంపూర్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. అప్రెంటిషిప్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఫ్రెండ్షిప్ మేళాలో పాల్గొనాలన్నారు. అర్హత గలవారు www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.


