News February 25, 2025
మంచిర్యాల: మాతాశిశు ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిలవలు, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని సమయానుసారంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News October 16, 2025
అశ్వారావుపేట: పోరుకు పుంజులు సన్నద్ధం..!

అశ్వారావుపేట మండలానికి చెందిన ఓ రైతు సంక్రాంతి కోసం తన పొలంలో వందలాది కోడి పందెం పుంజులను పెంచుతున్నాడు. గ్రీన్ హీట్ కంచెలు, ఇనుప గంపలు, తాటి ఆకులతో ఏర్పాటు చేసిన రక్షణ గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ దగ్గర పడుతుండటంతో పుంజులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
News October 16, 2025
ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.
News October 16, 2025
పడిపోయిన అన్ని రకాల మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు మళ్లీ తగ్గాయి. తేజ మిర్చి క్వింటా బుధవారం రూ.14,850 ధర వస్తే.. నేడు రూ.14,450కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15,900 ధర పలకగా.. ఈరోజు రూ.15,500 కి తగ్గింది. వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.16,500 ధర వస్తే.. నేడు రూ.16,200కి పతనమైంది. అలాగే దీపిక మిర్చికి రూ.14,800 ధర వచ్చింది.