News February 25, 2025
మంచిర్యాల: మాతాశిశు ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిలవలు, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని సమయానుసారంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్గా అవతరించింది. కాగా కార్పోరేషన్ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.
News November 28, 2025
గొలుగొండ: షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టిన భర్త.. భార్య సూసైడ్

మండలంలోని కొంగసింగిలో వివాహిత అరిటా లక్ష్మీపార్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలి భర్త ప్రసాద్ నేవీ ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యాడు. అనంతరం వచ్చిన రూ.20 లక్షలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరి మధ్యగొడవ జరింది. అనంతరం తన గదిలోకి వెళ్లిన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది.


