News March 26, 2025
మంచిర్యాల: మున్సిపల్ కమీషనర్లకు కలెక్టర్ సూచనలు

మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీల ఆదాయ వనరులను అభివృద్ధి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ కమీషనర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహిచారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, పారిశుద్ధ్యంపై పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News November 16, 2025
HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE
News November 16, 2025
HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.
News November 16, 2025
రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


