News February 11, 2025

మంచిర్యాల: యథాతథంగా భాగ్యనగర్ రైలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి నేటి నుంచి ఈ నెల 15 వరకు యథాతధంగా నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భాగ్యనగర్ రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News October 16, 2025

దైవ నామాన్ని ఎప్పుడు స్మరిస్తే ఏ ఫలితం ఉంటుంది?

image

కార్య సాధనలో దైవ నామ స్మరణ గొప్ప ఫలితాలను ఇస్తుంది. నడుస్తూ దేవుడి పేరును జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. వంట చేసే సమయంలో దైవ నామస్మరణ చేస్తే ఆహారం మహా ప్రసాదంగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు దేవుడి పేరును తలుచుకుంటే ఆ స్నానం తీర్థ స్నానంతో సమానమవుతుంది. నిద్రించే ముందు దేవుని ధ్యానం చేస్తే అది ధ్యాన నిద్రగా మారుతుంది. మనం నివసించే ఇంట్లోనే దైవాన్ని స్మరిస్తే ఆ ఇల్లే పవిత్ర దేవాలయంగా మారుతుంది.

News October 16, 2025

తెలంగాణ అప్డేట్స్

image

*నేడు క్యాబినెట్ భేటీ.. BC రిజర్వేషన్ బిల్లు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం
*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. GO-9పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన రేవంత్ సర్కార్
*నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు

News October 16, 2025

చైనాపై 500% టారిఫ్స్ విధించాలి: బెస్సెంట్

image

US-చైనా ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచుతామని అమెరికా బెదిరిస్తోంది. ‘రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 85మంది US సెనేటర్లు చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచేందుకు ట్రంప్‌కు అధికారమివ్వాలని చూస్తున్నారు’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. పైకి రష్యన్ ఆయిల్ పేరు చెబుతున్నా.. రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఈ బెదిరింపులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.