News February 4, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద <<15356057>>మహిళా ఎస్ఐ శ్వేత కారు..<<>> ఓ బైక్ ను ఢీకొట్టగా ఎస్ఐతో పాటు మరో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ యువకుడు మంచిర్యాల జిల్లాలోని ఓ బ్యాంకులో పని చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లక్షెట్టిపేట పట్టణంలోని DBS బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్యాల నరేశ్(26)  ఉదయం జాబ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు.

Similar News

News October 27, 2025

జగిత్యాల: పంట కొనుగోళ్లపై సందేహాలున్నాయా..?

image

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రేపు ఉ.10 నుంచి 11 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మార్కెటింగ్, మార్క్‌ ఫెడ్, ECCI అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా రైతులు తమ సమీప రైతువేదికల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పంట కొనుగోళ్లపై ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.

News October 27, 2025

శ్రేయస్‌కు సీరియస్.. అసలు ఏమైందంటే?

image

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయింది. ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే Spleen(ప్లీహమ్) అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్(spleen rupture)కు దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్‌ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకే శ్రేయస్‌ను ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

News October 27, 2025

చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

image

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్‌టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.