News April 7, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో విద్యార్థి మృతి

image

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్‌‌కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.

Similar News

News November 22, 2025

ములుగు DCC అధ్యక్షుడిగా అశోక్

image

ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో తొలిసారి పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న అశోక్.. వరుసగా రెండోసారి పదవిని చేపట్టనున్నారు. ప్రభుత్వానికి, కార్యకర్తలకు వారధిగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News November 22, 2025

వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి నియామకం

image

వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన కొత్త కాపు శివసేనారెడ్డి నియమితులయ్యారు. ఊహించని రీతిలో ఆయన ఎంపిక కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాలు పోటీ పడగా, వారికి నిరాశే మిగిలింది. శివసేనారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

News November 22, 2025

MHBD DCC అధ్యక్షురాలిగా డా.భూక్యా ఉమా

image

MHBD జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా డా.భూక్యా ఉమా నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమా గతంలో మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేశారు. ఉమా ప్రస్తుత ఎమ్మెల్యే మురళి నాయక్ సతీమణి కావడం గమనార్హం.