News February 4, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద <<15356057>>మహిళా ఎస్ఐ శ్వేత కారు..<<>> ఓ బైక్ ను ఢీకొట్టగా ఎస్ఐతో పాటు మరో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ యువకుడు మంచిర్యాల జిల్లాలోని ఓ బ్యాంకులో పని చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లక్షెట్టిపేట పట్టణంలోని DBS బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్యాల నరేశ్(26)  ఉదయం జాబ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు.

Similar News

News January 15, 2026

ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

image

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.

News January 15, 2026

రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

image

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News January 15, 2026

కొత్తకొండ జాతరకు కొత్తపల్లి ఎడ్ల రథాలు!

image

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి గత 60 ఏళ్లుగా కొత్తకొండ జాతరకు రథాలు బయల్దేరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సుమారు 80 ఎడ్ల బండ్లతో రథయాత్ర సాగుతుంది. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.