News March 5, 2025

మంచిర్యాల: యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై సమావేశం

image

యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల మేరకు రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. వేసవి అయినందున నీడ, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 23, 2025

చిన్నస్వామి స్టేడియానికి నో పర్మిషన్

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన <<18648940>>విజయ్ హజారే ట్రోఫీ<<>> మ్యాచ్‌లకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్ కోరినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రేపు జరగాల్సిన మ్యాచ్‌ను నగర శివారులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తరలించారు. RCB IPL విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

News December 23, 2025

ఉత్తరాంధ్ర భూములపై TDP కన్ను: బొత్స

image

ఉత్తరాంధ్రపై TDP కన్ను పడిందని, విలువైన భూములను కొన్ని కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఎకరం రూ.50Cr-100Cr విలువైన భూములను తక్కువ ధరకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. భూ కేటాయింపుల్లో ఇన్‌సైడర్ వ్యవహారాలు జరుగుతున్నాయని దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. YCP అధికారంలోకి వచ్చాక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

News December 23, 2025

ఉత్తరాంధ్ర భూములపై TDP కన్ను: బొత్స

image

ఉత్తరాంధ్రపై TDP కన్ను పడిందని, విలువైన భూములను కొన్ని కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తోందని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఎకరం రూ.50Cr-100Cr విలువైన భూములను తక్కువ ధరకు దోచిపెడుతోందని మండిపడ్డారు. భూ కేటాయింపుల్లో ఇన్‌సైడర్ వ్యవహారాలు జరుగుతున్నాయని దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. YCP అధికారంలోకి వచ్చాక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.