News March 20, 2025

మంచిర్యాల: యువతికి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు 

image

మంచిర్యాలలోని రాంనగర్‌కు చెందిన బొడ్డు సంకీర్తన ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం.. ఆ తర్వాత గ్రూప్ 4, గత జనవరిలో జరిగిన సీడీపీఓ పరీక్షతో పాటు సూపర్‌వైజర్ గ్రేడ్-1లో రెండు ఉద్యోగాలు, బుధవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్ 1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2, మల్టీజోన్‌లో 1వ ర్యాంకు సాధించింది.

Similar News

News March 28, 2025

ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

image

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్‌లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

News March 28, 2025

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత ఆర్డీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో ఆయా డివిజన్లో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే నీటి సమస్యపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించి పరిష్కరించాలన్నారు.

News March 28, 2025

పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేవీఆర్

image

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు, సాగు నీరు, త్రాగు నీరు వంటి అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!