News February 17, 2025

మంచిర్యాల: రైలు కింద పడి మహిళ మృతి

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సోమవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వయస్సు 50 – 55 సంవత్సరాలు ఉండగా, ఎడమ చేతిపై జనగామ లక్ష్మి అని పచ్చబొట్టు ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8328512176, 9490871784 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News November 1, 2025

విశాఖ: హత్య చేసి స్వామీజీ అవతారమెత్తాడు

image

విశాఖ స్ర్పింగ్ రోడ్డుకు చెందిన యుగంధర్ 2021లో అదే ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డిని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు అరెస్టు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. బెయిల్‌పై బయటకొచ్చి కోర్టుకు హాజరవ్వకపోవడంతో అతనిపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. హిమాలయాల్లో భైరవస్వామిగా మారువేషంలో యుగంధర్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. 2టౌన్ CI ఎర్రంనాయుడు, SIలు మన్మథరావు, సతీశ్‌ను సీపీ అభినందించారు.

News November 1, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి దినుసుల ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2051, కనిష్ఠ ధర ₹1716, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1871, కనిష్ఠ ధర ₹1725, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర ₹2511, కనిష్ఠ ధర ₹2251, వరి ధాన్యం (BPT) ధర ₹2031, కనిష్ఠ ధర ₹2021గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా 196.00 క్వింటాళ్ల మక్కల కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.

News November 1, 2025

NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

image

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌ను<<>> సంప్రదించండి.